Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

దివ్యాంగుల కొరకు DIVYA AI సర్వీసును కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది

 భారతదేశం అంతటా ప్రభుత్వ పథకాలు, సహాయ సేవలు, ప్రయోజనాలు మరియు సౌకర్యాల గురించి సమాచారాన్ని పొందేందుకు వికలాంగుల కోసం ఒక వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్ భారత వికలాంగుల సాధికారత శాఖచే రూపొందించబడింది. సమాచారాన్ని ఫోను కాల్ ద్వారా లేదా వాట్స్ ఆప్ ద్వారా పొందవచ్చు.

DIVYA VOICEBOT: 

  • వికలాంగుల కోసం ప్రభుత్వ పథకాలు, సహాయ సేవలు, ప్రయోజనాలు మరియు సౌకర్యాల గురించి DIVYA VOICEBOT అనే AI సర్వీసు ద్వారా ఇవ్వబడిన టోల్ ఫ్రీ నెంబరు: 011-44739626 కు ఫోను చేయటం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. 
  • ఫోన్ చేసినపుడు మీకు కావలసిన భాషలో సమాచారం ఇవ్వగలరని కోరినచో మీరు ఎంచుకున్న భాషలో సమాచారం ఇవ్వబడుతుంది.
  • విద్య, ఉద్యోగం, ఫిర్యాదులు, పధకం సిఫార్సులు, UDID ప్రశ్నలు మరియు హెల్ప్ లైన్ వివరాలు ఇలా అనేక విధాలుగా సమాచారం సేకరించవచ్చు. 
  • మీరు ఎంచుకున్న సేవను బట్టి మీ యొక్క వైకల్య వివరాలను సేకరించి దానికి అనుగుణంగా సమాచారం తెలియజేయబడుతుంది.

DIVYA CHATBOT: 
  • వికలాంగుల కోసం ప్రభుత్వ పథకాలు, సహాయ సేవలు, ప్రయోజనాలు మరియు సౌకర్యాల గురించి DIVYA CAHTBOT అనే AI సర్వీసు ద్వారా ఇవ్వబడిన నెంబరు: 96466 22622 వాట్స్ ఆప్ కు Hi అను  సందేశం పంపించుట ద్వారా కావలిసిన సమాచారాన్ని పొందవచ్చు. 
  • 10 భాషలు ఈ సర్వీసు నందు అందుబాటులో కలవు. మీరు ఎంచుకున్న భాషలో సమాచారం ఇవ్వబడుతుంది.
  • విద్య, ఉద్యోగం, ఫిర్యాదులు, పధకం సిఫార్సులు, UDID ప్రశ్నలు మరియు హెల్ప్ లైన్ వివరాలు ఇలా అనేక విధాలుగా సమాచారం సేకరించవచ్చు. 
  • మీరు ఎంచుకున్న సేవను బట్టి మీ యొక్క వైకల్య వివరాలను సేకరించి దానికి అనుగుణంగా సమాచారం తెలియజేయబడుతుంది.


దృష్టి లోపం గల దివ్యాంగులకు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపిసి కోర్సులు చదవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం

     దృష్టి లోపం గల దివ్యాంగులకు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపిసి కోర్సులు చదవడానికి అవకాశం కల్పిస్తూ కళాశాల విద్యాశాఖ 04/09/2025 న జీఓ ఆర్ టి నెం. 278 జారీ చేసింది.

జి.ఒ : 

జి.ఒ. డౌన్లోడ్ కొరకు క్లిక్ చేయండి 👉 G.O.Rt.No.278; తేది: 04-09-2025.

జి.ఒ. సారాంశము :

  • 04.03.2022 తేదీ: G.O. Ms. No. 12, పాఠశాల విద్య (IE-A2) శాఖలో జారీ చేయబడిన ఉత్తర్వులు మరియు జి.ఒ. నందు ఇవ్వబడిన 5వ సూచనలో ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి పేర్కొన్న పరిస్థితుల కొనసాగింపుగా, ప్రభుత్వం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, 2025-26 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చేలా మరియు వికలాంగుల హక్కుల చట్టం - 2016 నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరల్ విద్యార్థులతో సమానంగా సైన్స్ స్ట్రీమ్‌లలో (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం మరియు గణితం మొదలైనవి) ఇంటర్మీడియట్ కోర్సులను అభ్యసించడానికి దృష్టి లోపం ఉన్న విద్యార్థులను ఇందుమూలంగా అనుమతించింది.
  • ప్రాక్టికల్ పరీక్షలు సూచించబడిన సబ్జెక్టులకు, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు సంబంధించి ఈ క్రింది మూల్యాంకన విధానాన్ని అవలంబించాలి:
    • ఆచరణాత్మక పరీక్షలకు బదులుగా, ఆచరణాత్మక భాగం ఆధారంగా బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగిన ప్రత్యేక ప్రశ్నపత్రాన్ని అందించాలి, దీనికి ఎటువంటి దృశ్య ఇన్‌పుట్ అవసరం లేదు.
  • ఈ నిబంధన భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్ర విషయాలకు వర్తిస్తుంది.